భారత స్వాతంత్ర్య దినోత్సవం

ఈ రోజు మనందరం గర్వంగా, అందరం జరుపుకునే రోజు – భారత స్వాతంత్ర్య దినోత్సవం.
1947 ఆగస్టు 15… ఈ రోజు, మన దేశం బ్రిటీష్ పాలన నుండి పూర్తిగా స్వేచ్ఛను పొందింది.
కానీ ఈ స్వేచ్ఛ కేవలం ఒక రాత్రిలో రాలేదు… దాదాపు 200 ఏళ్ల పోరాటం, వేలాది వీరుల త్యాగాల ఫలితం ఇది.” “మన చరిత్రలో మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం, సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యం, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి లక్ష్మీబాయ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు… ఇవన్నీ ఈ రోజు మనం శ్వాసిస్తున్న స్వేచ్ఛకు పునాది.”

“1947 ఆగస్టు 14 అర్ధరాత్రి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారు ప్రసిద్ధ ‘Tryst with Destiny’ ప్రసంగం ఇచ్చారు.
అది కేవలం ఒక ప్రసంగం కాదు… అది ఒక కల నెరవేరిన క్షణం.
తరువాతి రోజు, ఆగస్టు 15 ఉదయం, ఎర్రకోటపై మొదటిసారి భారత త్రివర్ణ పతాకం ఎగురవేయబడింది.”

“ఈ తేదీని Lord Mountbatten ఎంచుకున్నారు. ఎందుకంటే 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రోజు కూడా ఇదే.అందుకే భారత స్వాతంత్ర్యం ఈ రోజు నుంచే ప్రారంభమైంది.””ప్రతి సంవత్సరం, ఈ రోజున, ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి, దేశ ప్రజలకు ప్రసంగిస్తారు.21 తుపాకుల వందనం, సైనిక పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు… ఇవన్నీ ఈ పండుగలో భాగం.పాఠశాలల్లో, కళాశాలల్లో దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు జరుగుతాయి.””2025లో మనం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12వ సారి ఎర్రకోటపై ప్రసంగించనున్నారు.ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి…”

“మొదటిది – బస్తర్ గ్రామాలు: మావోయిస్టుల భయంతో ఇన్నేళ్లుగా జాతీయ పతాకం ఎగరని 14 గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకం ఎగరబోతుంది.రెండవది – మణిపూర్ భద్రత: తిరుగుబాటు వర్గాల బెదిరింపుల కారణంగా భద్రత మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఆయుధాలు స్వాధీనం చేసుకుని పండుగ సురక్షితంగా జరగేలా చర్యలు తీసుకుంటున్నారు.””స్వాతంత్ర్య దినోత్సవం అనేది స్వేచ్ఛ, ఏకతా, ప్రజాస్వామ్య స్ఫూర్తి, త్యాగాల గుర్తు.79 ఏళ్లుగా ఈ రోజు మనకు గర్వం, ప్రేరణ, దేశభక్తి నింపుతోంది.”

  • “ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం…
  • మన స్వేచ్ఛను కాపాడుకుందాం…
  • మన దేశాభివృద్ధికి మన వంతు సహకారం అందిద్దాం…
  • జై హింద్!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *